త్వరలో తిరుపతి పార్లమెంట్ కి ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.
వైసిపి పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో రాబోతున్న ఈ ఉప ఎన్నికలలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే ప్రధాన పార్టీల అధ్యక్షులు తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.వైసీపీ పార్టీ తరఫున డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, జనసేన బీజేపీ కూటమి నుండి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, కాంగ్రెస్ పార్టీ నుండి చింతామోహన్ పోటీకి రెడీ అవుతున్నారు.
ఇటువంటి తరుణంలో ఈ ఉప ఎన్నిక విషయంలో ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది.మేటర్ లోకి వెళితే ఇటీవల నగరపాలక సంస్థ ఎన్నికలు జరగటంతో ఓటర్లకు ఎడమచేతి పై సిరా గుర్తు వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఎన్నికలలో ఎడమచేతికి బదులు కుడి చేతికి సిరా గుర్తు వేయటానికి ఎన్నికల సంఘం రెడీ అయింది.నగర పాలక సంస్థల ఎన్నికల టైంలో వేసిన గుర్తు ఇంకా తిరిగి చెరిగిపోకపోవడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.