దేశ వ్యాప్తంగా 45 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్డౌన్ను అమలు చేశారు.దాంతో కరోనా పాజిటివ్ కేసులు గననీయంగా పెరగకుండా చూశారు.
పోలీసులు, డాక్టర్లు చేస్తున్న పోరాటంను ప్రతి ఒక్కరు అభినందించారు.కరోనా ఇంకా ఇండియాలో తగ్గనే లేదు.
పైగా ఇప్పుడే కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా నమోదు అవుతున్నాయి.రోజుకు మూడు నుండి నాలుగు వేల వరకు కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో లాక్డౌన్ సడలింపులు వైన్స్ ఓపెన్ వంటి పనులు చేయడంతో ప్రభుత్వాలపై సామాన్యుల్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో వైన్స్ను ఓపెన్ చేయడంను చాలా మంది తప్పుబడుతున్నారు.
ఆదాయం కోసం వైన్స్ను ఓపెన్ చేయడం జరిగింది.
వైన్స్ వద్ద సామాజిక దూరం పాటించాలంటూ విజ్ఞప్తి చేసినా కూడా ఏ ఒక్కరు కూడా ఆ దిశగా జాగ్రత్తలు పాటించడం లేదు.తెలంగాణలో మొదటి రోజు వైన్స్ వద్ద కిలోమీటర్ల మేరకు లైన్స్ కనిపించాయి.
సామాజిక దూరం ఎక్కడ లేదు.అన్ని వైన్స్ వద్ద కూడా జనాలు గుమ్మి గూడే ఉన్నారు.
వారిలో ఎక్కువ శాతం మంది కనీసం మాస్క్లను కూడా ధరించి లేరు.ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
కాని ప్రభుత్వాలు మాత్రం వైన్స్ ఓపెన్కే మొగ్గు చూపుతున్నారు. వైన్స్ ఓపెన్ చేయడం వల్ల జరిగే పరిణామాలు మరో రెండు వారాల తర్వాత తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరోనాతో బాధపడుతున్న వారు ఒక్కరు వైన్స్కు వచ్చినా వందల మంది మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.