ప్రస్తుత సమాజంలో జరిగే ఘటనలు ఒక్కోసారి తలుచుకుంటే ఒక్కోసారి ఒళ్లు గగుర్పొడుస్తుంది.హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో జరిగిన ఘటన తలుచుకుంటే వామ్మో అనిపిస్తుంది.
వనస్థలిపురంలో ఓ కుక్క ఓ బాలుడి తలను నోటకరుచుకుని వెళ్లడం కలకలం రేపింది.ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తు ముగిసిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న భాగ్యనగర వాసులు షాక్ కు గురవుతున్నారు.
చాలా మంది జంటలు పిల్లలు లేక తల్లడిల్లుతుంటే కొన్ని చోట్ల మాత్రం ఇలా జరుగుతుండడం బాధిస్తోందని కొందరు పేర్కొంటున్నారు.ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.
వనస్థలిపురంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో కుక్క ఓ పసి బాలుడి తలను నోట కరుచుకొని వచ్చింది.ఇది చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు వచ్చి వివరాలను ఆరా తీస్తున్నారు.
ఎల్బీ నగర్ కు చెందిన కార్తిక్ అనే వ్యక్తి మన్సూరాబాద్ లోని ఓ పాల దుకాణంలో కూర్చుని ఉండగా.ఆ సమయంలో ఓ కుక్కు అటు వైపు నుంచి బాలుడి తలను నోట కరుచుని వెళ్లడం చూసి షాక్ అయ్యాడు.
వెంటనే ఆ కుక్కను వెంబడించాడు.దీంతో ఆ కుక్క ఆ బాలుడి మొండాన్ని ఓ చెట్ల పొదల్లో పడేసి పారిపోయింది.
ఇది చూసిన కార్తిక్ వెంటనే పోలీసులకు సమాచారం అందిచాడు.ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటన ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపిక్ గా మారింది.