ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్న పరిస్థితులలో మూగజీవాలను పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.డబ్బుకు ప్రాధాన్యం ఇస్తూ పెద్ద కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారి ప్రశాంతతను కోల్పోయిన పరిస్థితి ఉంది.
ఇళ్లలో మూగజీవాలతో ఇంట్లో ఒకరిగా చూసుకుంటూ వాటితో ప్రశాంతంగా గడుపుతున్న పరిస్థితి ఉంది.ఎక్కువ శాతం కుక్కలను పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎందుకంటే అవి మనలాగే కొద్దిగా ఆలోచిస్తాయి.విశ్వాసంగా ఉంటూ ఇంట్లో మనిషిలా మనతో మెలుగుతూ ఉంటుంది.
కుక్కలకు మంచి మనసు ఉంటుందనే విషయం మనకు చాలా సంఘటనల్లో రుజువైంది.అపదల నుండి రక్షించి యాజమానుల ప్రాణాలను కాపాడిన సంఘటనలు చాలా ఉన్నాయి.ఇంట్లో ఇప్పుడు అచ్చం ఇలాగే లేగదూడ పట్ల మానవత్వం చాటుకున్న ఘటన వైరల్ గా మారింది.ఆకలితో అలమటిస్తున్న ఓ లేగదూడకు శునకం పాలిచ్చి లేగ దూడ ఆకలిని తీర్చిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు శునకం మానవత్వాన్ని చూసి శభాష్ అంటున్న పరిస్థితి ఉంది.నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఘటన జంతువులు తమకు తాము మానవత్వాన్ని చాటుకుంటున్న ఓ గొప్ప ఘటనగా మనం అభివర్ణించవచ్చు.
.