కుటుంబ కలహాల విషయంలో చదువుకున్న వారు, చదువులేని వారు ఒకేలా ఆలోచిస్తున్నారు.ఏదైనా సమస్య ఎదురైతే చంపడమో, చావడమో పరిష్కారం అని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఎందరో తమ భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టుకుంటున్నారు.ఇకపోతే ఉన్నత విద్యావంతుడైన ఒక వైద్యుడిని అతని భార్య విడాకులు కోరిందని అతి కిరాతకంగా చంపాడు.
ఆ వివరాలు తెలుసుకుంటే.
తమిళనాడు, కోయంబత్తూరుకు చెందిన గోకుల్ కుమార్(40) అనే వైద్యుడు కీర్తన అనే మహిళను వివాహం చేసుకుని ఇల్లరికం అల్లుడిగా ఉంటున్నాడట.
కాగా వారి మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల వల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ క్రమంలో కోర్టును కూడా ఆశ్రయించారు.అయితే శుక్రవారం కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్ కత్తితో తన మామ మురహరిపై దాడి చేశాడు.కీర్తనను విచక్షణారహితంగా పొడిచి, కారుతో తొక్కించి చంపేశాడట.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.అయితే ఈ హడావుడిలో టోల్ గేటు వద్ద కారు బోల్తాపడడం తో గాయపడిన గోకుల్ చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడట.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తూ ప్రారంభించారట.