‘ఘాజీ’ వంటి చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంకల్ప్రెడ్డి తాజాగా ‘అంతరిక్షం’ చిత్రాన్ని తెరకెక్కించాడు.అద్బుతమైన విజువల్స్తో అంతరిక్షం సినిమా ఉండబోతుంది.
ఘాజీ చిత్రాన్ని నీటి అడుగున తీసిన దర్శకుడు ఆ చిత్రంతో వావ్ అనిపించాడు.ఇక భారీ ఎత్తున ఘాజీకి పేరు దక్కించుకున్న సంకల్ప్ రెడ్డి అంతరిక్షంతో ఆకాశమే హద్దుగా ఎదిగి పోవడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆయన స్థాయిని అమాంతం పెంచేసింది.
ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో స్పేస్ సెంటర్ నేపథ్యంలో ఈ చిత్రం విజువల్స్ ఉన్నాయి.అతి తక్కువ బడెట్తో సంకల్ప్ రెడ్డి ఇంత భారీగా, విజువల్స్ను హాలీవుడ్ రేంజ్లో ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేసుకున్నారు.సుకుమార్ కూడా ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఖచ్చితంగా సంకల్ప్ రెడ్డి స్థాయి ఎక్కడికో వెళ్తుందని జోస్యం చెప్పాడు.
తప్పకుండా సంకల్ప్ రెడ్డి తెలుగు దర్శకుల్లో టాప్ దర్శకుడు అవుతాడనే నమ్మకంను సినీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు.ట్రైలర్ చూసిన తర్వాత సంకల్ప్ రెడ్డికి శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిందే అంటూ ప్రేక్షకులు అంటున్నారు.
అంతరిక్షం మూవీ కోసం ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంకల్ప్ రెడ్డి రెడీ చేసుకున్న స్క్రిప్ట్పై చాలా నమ్మకంతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు.అద్బుతమైన విజువల్స్ను సంకల్ప్ సినిమాలో చూపించబోతున్నట్లుగా దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చాడు.ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో హీరోగా వరుణ్ తేజ్ నటించగా హీరోయిన్స్గా అదితిరావు, లావణ్య త్రిపాఠిలు నటించారు.ఈ చిత్రం విజయాన్ని దక్కించుకుంటే సంకల్ప్ రెడ్డి ఈసారి స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.