అడవులు వేగంగా అంతరించిపోతున్న క్రమంలో జంతువులకు ఉండటానికి చోటు ఉండటం లేదు.దీనివల్ల అవన్నీ కూడా మనుషులు ఉంటున్న ప్రదేశాల్లోకి వస్తున్నాయి.
అదేవిధంగా ఇటీవల ఓ జింక సిటీలోకి వచ్చింది.అనంతరం అది టిఫిన్ సెంటర్లోకి ఎంట్రీ ఇచ్చి ఆహారం కోసం తిరిగింది.
ఆపై అది ఏదో కస్టమర్ లాగా ప్రవర్తించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సామ్రాట్ గౌడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
నెట్టింట వైరల్గా మారిన ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.
కేరళలో ఒక రహదారి మీదకు ఒక జింక వచ్చింది.అనంతరం అది ఒక టిఫిన్ సెంటర్లోకి ప్రవేశించింది.
ఆ సమయంలో కొందరు కస్టమర్లు టీ, స్నాక్స్ తింటూ ఉన్నారు.వాళ్లు తనకు ఏమైనా ఫుడ్ పెడతారేమో అని అది ఆశగా చూసింది.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి వడ ముక్కను దాని నోటికి అందించాడు.వెంటనే అది దానిని కరకర నమి లేసింది.
అనంతరం ఇంకా తనకు ఫుడ్ పెట్టాలని అది సైగలతో అడిగింది.అంతేకాదు కాసేపు అక్కడే అటు ఇటు తిరుగుతూ ఫుడ్ కోసం వెతికింది.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దానికి టీ పోసాడు.అయితే ఆ వేడివేడి టీ అది తాగేందుకు ధైర్యం చేయలేదు.కాగా జింక చాలా దగ్గరగా రావడంతో కొందరు దానితో కలిసి ఫొటోలు దిగారు.ఈ జింక ప్రవర్తన చూసినప్పుడు ఇది చాలా ఫ్రెండ్లీ డీర్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.