ప్రస్తుత కాలంలో కొందరు అవగాహన లేకుండా ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇతరుల జీవితాల్లో తీవ్ర విషాదాలను నింపుతున్నారు. తాజాగా ఓ యువతి తన ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తున్నాడని తన రక్తాన్ని చెమటగా మర్చి పెంచిన కన్న తండ్రిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని వజీర్ గంజ్ పరిసర ప్రాంతంలో “మహమ్మద్ అమీర్” అనే 55 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తికి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
కాగా ఇతడికి 23 సంవత్సరాలు కలిగిన ఓ కూతురు ఉంది.ఈ మధ్య అమీర్ కూతురు స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో కొంతమేర చనువుగా ఉంటోంది.
అంతేగాక యువతి ఆ యువకుడితో ప్రేమలో పడినట్లు ఇటీవలే అమీర్ ఇతరుల ద్వారా తెలుసుకున్నాడు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అమీర్ మరోమారు యువకుడితో చనువుగా కనిపిస్తే బాగోదని తన కూతురిని హెచ్చరించాడు.
అయినప్పటికీ అమీర్ కూతురు తన తండ్రి మాటలను పెడచెవిన పెట్టింది.దీంతో అప్పుడప్పుడు ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరుగుతుండేవి.ఇటీవలే మరోమారు యువతి తన ప్రియుడితో కనిపించడంతో అమీర్ తన కూతుర్ని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి తన ప్రియుడితో ఈ విషయం చెప్పడంతో అతను ఏకంగా తన తండ్రిని పెట్రోల్ పోసి తగలబెట్టమని చెప్పాడు.
దీంతో ప్రేమ మైకంలో మునిగిపోయిన యువతి తన తన తండ్రని కూడా చూడకుండా అతడి ఒంటిపై పెట్రోలు పోసి తగలబెట్టి అక్కడి నుంచి పరార్ అయింది. మంటల్లో కాలిపోతున్న అమీర్ ని గుర్తించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.
దీంతో ప్రస్తుతం అమీర్ పరిస్థితి చాలా విషమంగా ఉంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తమ ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తున్నాడని తన కూతురే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలుసుకుని ఆమెను అరెస్టు చేశారు.