జీవితంలో ప్రతి మహిళకు మధురానుభూతిని కలిగించేది శ్రీమంతం.తల్లికాబోతున్నాననే ఆనందం ముందు శ్రీమంతం వేడుక వైభవంగా జరుగుతుంది.తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువుల సమక్షంలో శ్రీమంతం వేడుకగా నిర్వహిస్తారు.మరి అటువంటి శ్రీమంతాన్ని ఇక్కడ ఆవుకు చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఆవుకు శ్రీమంతం చేయడం కోసం చుట్టుపక్కల అమ్మలక్కలందరూ గుమికూడారు.ఆ తర్వాత ఆవుపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
హిందు సాంప్రదాయంలో ఆవులకు ప్రత్యేక స్థానం ఉంది.ఆవులను దేవుళ్లుగా పూజిస్తారు.
ముళ్లోకాల దేవుళ్లందరూ ఆవులో కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.మరి అటువంటి ఆవును ప్రేమగా చూసుకున్న కుటుంబం ఇలా శ్రీమంతం చేసి తమ ప్రేమను చాటింది.
నిర్మల్ జిల్లా పల్సి గ్రామంలో ఆవుకు శ్రీమంతం వేడుక జరిగింది.గ్రామానికి చెందిన రాములుస్వామి ఓ రైతు.
ఆ కుటుంబం తమ పశువులను, భూమిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.ఆ ఇంటి సభ్యులు ఇలా గోమాతకు శ్రీమంతం నిర్వహించడంతో స్థానికులు వారిని ప్రశంసిస్తున్నారు.
గ్రామస్తుల సమక్షంలో ఆవుకు శ్రీమంతం నిర్వహించారు.కొత్త బట్టలు తెచ్చి పెట్టి ఆవుకు సమర్పించారు.ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారు ఆవుకు అక్షింతలతో పూజలు నిర్వహించారు.శ్రీమంతానికి విచ్చేసినవారికి పిండి వంటలు చేసి భోజనాలు పెట్టారు.రాములు స్వామి ఇలా చేయడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఇలా ఆవుకు శ్రీమంతం చేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇంతలా ఆవును ప్రేమగా చూసుకునే వ్యక్తి రాములుస్వామిని స్థానికులు అభినందించారు.
ఆవులకు ఈ విధంగానే శ్రీమంతం చేసిన సంఘటనలు ఇదివరకూ చాలానే చోటుచేసుకున్నాయి.గతంలో కూడా గోదావరిజిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగాయి.కోస్తా ప్రాంతం, తెలంగాణలో ఆవులకు శ్రీమంతం చేసిన సంఘటనలు జరిగాయి.
తాజాగా ఇలా రాములు స్వామి శ్రీమంతం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.