అందుకోసమే ఆవుని పెంచుకుంటున్న సీఎం !

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరో సారి వార్తల్లోకెక్కారు.తాను పాల కోసం సీఎం అధికారిక నివాసంలో ఆవును పెంచుకుంటున్నట్లు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ప్రకటించారు.

 The Cow Is Growing In Tripura Cm-TeluguStop.com

పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకొని ఆవులను పెంచుకోవాలని విప్లవ్‌దేవ్ కోరారు.తనతోపాటు తన కుటుంబం ఆవుపాలనే తాగుతామని సీఎం చెప్పారు.

త్రిపుర రాష్ట్రంలో త్వరలో ఐదువేల కటుంబాలకు ఆవులను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు.పదివేల కోట్లరూపాయలు వెచ్చించి రెండువేల మందికి ఉపాధి కల్పించే బదులు పదివేల ఆవులను ఐదువేల కుటుంబాలకు అందజేస్తే వారికి ఆరునెలల్లో సంపాదిస్తారని సీఎం పేర్కొన్నారు.యువకులు ఖాళీగా ఉండకుండా ఆవులను పెంచాలని, పాన్ షాపులు పెట్టుకోవాలని గతంలో సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube