ఢిల్లీ బాంబు పేలుడు వెనక ఆ దేశం.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

ఇటీవల ఢిల్లీలో బాంబు పేలిన సంగతి తెలిసిందే.జరిగిన ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినా మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

 Israel,iran,modi,delhi,ambaci,private Cab,central Home Minister,latest News-TeluguStop.com

సరిగ్గా ఈ బాంబు పేలిన ప్రాంతం కొద్దిదూరంలో ప్రధాని మోడీ తో పాటు రాష్ట్రపతి కి సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది.దీంతో ఈ సంఘటన జరగడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి నట్లయింది.

అంతేకాకుండా సరిగ్గా ఇజ్రాయేల్ దౌత్య కార్యాలయం వద్ద ఈ ఘటన జరగటంతో సరి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించి విచారణకు రంగంలోకి దిగిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

Telugu Delhi, Iran, Israel, Modi-Latest News - Telugu

బాంబు అమర్చిన ఇద్దరు నిందితులు ప్రవేట్ క్యాబ్లో ఎంబసీ వద్దకు చేరుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.దీంతో ఊహాచిత్రాలను తీసిన పోలీసులు వారి ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.ఇదిలా ఉంటే సంఘటనా స్థలంలో నిందితులు ఓ లెటర్ కూడా వదిలి వెళ్లారు.ఇంగ్లీషు భాషలో ఉన్న ఆ లెటర్ ఇజ్రాయెల్ రాయబారి ఉద్దేశించి ఇరాన్ అణు శాస్త్రవేత్త జనరల్ అధికారిని చంపిన విషయాలను ఇందులో ప్రస్తావించారు.

ఇది ట్రైలర్ మాత్రమేనని ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ రాయబారిని బెదిరించారని విచారణ వర్గాల నుండి అందుతున్న సమాచారం.మరోపక్క ఈ ఘటనపై సమాచారాన్ని మోడీ అదే విధంగా కేంద్ర హోంమంత్రి తెలుసుకోవటం జరిగిందట.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube