తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆది పురుష్ సినిమా గురించే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రతి ఒక్కరూ కూడా ఆది పురుష్ సినిమా టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక ఈ టీజర్ విడుదల అయిన తర్వాత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ప్రభాస్ పై అలాగే చిత్రబృందం పై వారి స్థాయిలో ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయంపై పలువురు స్పందిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న హీరో ప్రభాస్ ను తొక్కేయడానికి బాలీవుడ్ లో ఈ విధంగా కుట్ర చేస్తున్నారని కామెంట్ చేశారు.
తాజాగా ఇదే వ్యాఖ్యలపై స్పందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ.
బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ను విఎఫ్ఎక్స్ లో చూసిన బాగోలేదు అన్నగారు సినిమా చూసిన తర్వాత ఏమి మాట్లాడలేదు.బిగ్ స్క్రీన్ పై చూసిన తర్వాత బ్రహస్త్ర సినిమాపై ప్రశంసలు కురిపించారు.
కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాను ఒక్క నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోని చూసి బాగోలేదు అని నిర్ణయించకూడదు.మనకు పూర్వం నుంచి రామాయణం అంటే ఈ విధంగా ఉంటుంది అన్న ఆలోచన ఉంది కానీ ఆది పురుష్ సినిమా ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉండడంతో చాలామంది విమర్శలు చేస్తున్నారు.
అలాగే ఒక నిర్మాత నాకు ఫోన్ చేసి రాముడికి మీసాలు ఉండడం ఏంటి అని ప్రశ్నించాడు అప్పుడు నేను రాముడికి మీసాలు ఎందుకు పెట్టకూడదు అని మేకర్స్ కి అనిపించి ఉండవచ్చు అని తెలిపారు రాంగోపాల్ వర్మ.అయితే ఆది పురుష్ చిత్ర బృందం రామాయణాన్ని చూపిస్తున్నాం అని కాకుండా, రామాయణం ఆధారంగా ఓ ఫిక్షనల్ సినిమా చేస్తున్నము అని చెప్పి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు అని చెప్పుకొచ్చారు ఆర్జీవి.అలాగే బాలీవుడ్ లో కొందరు కుట్ర చేసి ఆది పురుష్ సినిమా పై ట్రోలింగ్ చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి.అయితే ప్రభాస్ పై కుట్ర జరుగుతుంది అన్న విషయం కంటే పెద్ద జోక్ నా లైఫ్ లో నేను వినలేదు అంటూ కామెడీగా స్పందించారు రాంగోపాల్ వర్మ.
ప్రభాస్ పై కుట్ర జరుగుతోంది అన్నది పెద్ద జోక్ అని ఆయన తెలిపారు.