సమీకృత కలెక్టరేట్ భవన పనులను పరిశీలించిన కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కుడకుడ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన పనులను జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావు ( S Venkata Rao )గురువారం మధ్యాహ్నం తనిఖీ చేశారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) ఇటీవల నూతన కలెక్టరేట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.దీనిలో భాగంగానే జిల్లా కలెక్టర్( Collectorate ), జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ కలసి పనులను పరిశీలించి వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

నూతన సమీకృత భవన్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో పనులు వేగంగా జరగాలని లేబర్,మెటీరియల్ పెంచి పనులు వేగం పెంచాలని తెలిపారు.జూన్ మొదటి వారం వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.సి నరసింహ నాయక్,ఈఈ ఎం.యాకూబ్ అలీ, డివైఈ పవన్,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది...ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి...

Latest Suryapet News