అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యతిస్తూ సీఎం పాలన కొనసాగుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.నవరత్నాలనే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ప్రజల అవసరాలు తీర్చాలని ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.13 జిల్లాల్లో అభివృద్ధిని ఏమాత్రం తక్కువ చేయకుండా గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి అందిస్తున్నాం.పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖను అభివృద్ధి చేసుకోవాలన్న ధ్యేయంతో పరిపాలన సాగుతోంది.
అందులో భాగంగా ఖాళీ స్థలాలలో 800 పార్కులను, వాటర్ బాడీస్ ను అభివృద్ధి చేస్తున్నాం.జీవీఎంసీ పరిధిలో వార్డు డెవలప్మెంట్ ప్లాన్స్ ను తయారు చేశాం.
వార్ డెవలప్మెంట్ ప్లాన్స్కు అమలుకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నం జరుగుతుంది.భీమిలి, ఆనందపురం, పెందుర్తి లలో జనాభా పెరుగుతుంది కాబట్టి అవసరానికి తగ్గట్టు అభివృద్ధి చేసుకోవాలి.
సుందర నగరం విశాఖను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం.దీనికి ప్రజల సహకారం అవసరం.
వాతావరణ సమతుల్యతకు అందరూ కృషి చేయాలి.అన్ని ప్రాణులు ఉంటేనే సమతుల్యత ఉంటుంది.
వాతావరణ సమతుల్యత వల్లే ప్రకృతి విపత్తులు రాకుండా కాపాడుకోగలం.