దేశంలో కరోనా వైరస్ వల్ల పరిస్దితులు చేయిదాటి పోతున్నట్లుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే కరోనా బాధితుల ఆర్తనాదాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక మరణిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
అంతే కాకుండా కొందరైతే అత్యంత హృదయవిదారకంగా కరోనా వల్ల మరణిస్తున్నారు.ఏ బంధాలు గుర్తుకు రావడం లేదు.ఎవరికి ఎవరు కాకుండా చెట్టుకొకరు పుట్టకొకరులా బ్రతుకుతున్నారు.ఇప్పటికే కొన్ని చోట్ల లాక్డౌన్ అమలు అవుతుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు.
అయినా పరిస్దితులు అదుపులోకి రావడం లేదు.
ఇకపోతే ఏపీలోని శ్రీకాకుళం నగరం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు.కాగా జిల్లాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 30 శాతం కేసులు శ్రీకాకుళం నగరం లోనే నమోదు కావడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అందువల్ల నేటి నుండి 14 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు.