కల ఎప్పుడూ ఎవరి సొంతం కాదు.దాన్ని సాధించాలనే తపన ఉండాలే గానీ అనువణువునా మనకు తారసపడుతుంది.
ఇక మన దేశంలో అయితే ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో అనేక రకాల సాంప్రదాయాలకు సంబంధించిన కలలు ఉన్నాయి.కొన్ని చోట్ల సంప్రదాయ నృత్యాలు చాలా ఫేమస్.
కూచిపూడి, భరత నాట్యం అని ఇలా ఎన్నో రకాల కలలు మన ఇండియాలో ఉన్నాయి.ఇకపోతే నార్త్ ఇండియాలో మరీ ముఖ్యంగా తూర్పున ఉన్న చిన్న ఏడు రాష్ట్రాల్లో ఇలాంటి కలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఇందులో ఎక్కువగా జానపద కలలు ఉంటాయి.
ఇక ఆయా ప్రాంతాల్లో ఉండే వారు వాటిని ఎంతో ఆదరిస్తారు.
చిన్న తనం నుంచే ఆయా కలలను నేర్చుకుంటారు.ఇప్పుడు కూడా ఓ ఇద్దరు చిన్నారులు ఇలాగే తమ సాంప్రదాయాన్ని ఉట్టి పడేలా చేసి ఏకంగా సీఎంను మెప్పించారు.
చిన్న పిల్లలు అంటేనే కల్మషం లేని మనసులతో స్వచ్ఛమైన పనులే చేస్తారు.అందుకే వారి డ్యాన్స్ మరింత స్వచ్ఛంగా ఉంది.
అందమైన చిరునవ్వులతో చేసిన అద్భుతమైన డ్యాన్స్కు ఆ రాష్ట్ర సీఎం కూడా ఫిదా అయిపోయారు.ప్రస్తుతం వారి వీడియో నెట్టింట బాగా పాపులర్ అయిపోతోంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సజోలాంగ్ తెగలో నివసించే వారు జానపద కలలను బాగా ఆచరిస్తారు.ఇక వెస్ట్ కమెంగ్ జిల్లాకు చెందినటువంటి ఖాజాలాంగ్ గ్రామంలో ఓ వేడుక సందర్భంగా ఇద్దరు చిన్నారులు తమ ట్యాలెంట్ ను నిరూపించుకున్నారు.సంప్రదాయ బట్టల్లో ఇద్దరూ కలిసి జానపద పాటకు అద్భుతంగా స్టెప్పులు వేశారు.పైగా అక్కడున్న మహిళలు జాతపద పాటలు పాడుతుంటా అందుకు తగ్గట్టుగా వారు నృత్యం చేశారు.
దీన్ని ఆ స్టేట్ సీఎం పెమా ఖండూ స్వయంగా ట్టిట్టర్ వేదికగా పోస్టు చేసి వారిని ప్రశంసించారు.తమ సంప్రదాయాలు ఉట్టి పడేలా చేశారని మెచ్చుకున్నారు.
.