హెలికాప్టర్ ఎక్కాలని చాలామంది అనుకుంటారు.కొంతమంది డ్రీం కూడా.
చాలా వరకు హెలికాప్టర్ లో రాజకీయనాయకులు.సెలబ్రిటీలు.
బాగా ఐశ్వర్యవంతులు తిరుగుతూ ఉంటారు.కానీ ఒక రాష్ట్రంలో రైతులతో ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో దాదాపు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టడం జరిగింది.
వాళ్లతో ముచ్చటిస్తూ హెలికాప్టర్లలో ఆ ప్రాంతంలో పర్యటించారు.పూర్తి విషయంలోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ఓ గ్రామీణ ప్రాంతంలో పర్యటించడం జరిగింది.
ఈ క్రమంలో.రైతుల సమస్యల గురించి వింటూ ఉన్న తరుణంలో.హెలికాప్టర్ పై ఏరియల్ సర్వే చేయాలని భావించిన సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ పక్కనే ఉన్న నలుగురు రైతుల ని హెలికాప్టర్ ఎక్కుతారా అని ప్రశ్నించగా వారు ఇదే చాన్స్ అనుకుని నలుగురు రైతులు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో.హెలికాప్టర్ లో దర్జాగా కూర్చుని దాదాపు అరగంట పాటు ఆ ప్రాంతంలో గాల్లో పర్యటించడం జరిగింది. మధ్యప్రదేశ్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.సామాన్య ప్రజలతో ఊరికినే కలిసిపోయే మనస్తత్వం కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్అ న్నిసార్లు గెలుస్తున్నాడు అని మరికొంతమంది తాజా వీడియో పై కామెంట్ చేస్తున్నారు.