వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొంతకాలంగా అదేపనిగా ప్రభుత్వంపైనా, జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు మరి శ్రుతి మించాయి అనే వ్యాఖ్యలు వినిపించాయి.
అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ చేసిన విమర్శలతో పాటు, మరికొన్ని అంశాలపై ఏపీ సిఐడి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో ఉన్నారు.
అయితే రఘురామ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలి పెట్టకూడదని, అసలు ఆయన వెనుక ఎవరున్నారు ? ఆయన విమర్శలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నవారు ఎవరు ? ఎవరితో ఆయన నిత్యం సంభాషిస్తున్నారు.దానికి సంబంధించి వాట్స్అప్ చాట్ మెసేజ్ లు వంటివి కీలకంగా మారాయి.
అలాగే ఆయన ఫోన్ డేటాను సైతం విశ్లేషించే పనిలో సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు .ఇప్పటికే రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో సంబంధం ఉంది అనే అభిప్రాయంతో రెండు మీడియా ఛానళ్ల పైన కేసులు నమోదు చేశారు.ఇప్పుడు ఆ వ్యవహారాల పైన సిఐడి అధికారులు దృష్టిపెట్టారు.మొత్తం ఇప్పుడు రఘు రామ కృష్ణం రాజు వ్యవహారంలో ఆయన సెల్ ఫోన్ ప్రధాన సాక్ష్యంగా మారబోతోంది.దీంతో రఘురామ కృష్ణరాజు వెనకుండి వ్యవహారాన్ని నడిపిన నేతల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.ఈ కేసు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉండడం, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి పైన కేసులు నమోదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కేసు ద్వారా రఘురామకృష్ణంరాజు సీరియస్ యాక్షన్ తీసుకుని భవిష్యత్తులో మరెవరూ ఈ విధంగా వ్యవహారాలు చేయకుండా కట్టడి చేసేందుకు జగన్ ఈ ఎత్తుగడ వేసినట్టుగా అర్దం అవుతోంది.
ఇప్పటికే రఘురామకృష్ణంరాజు కు మద్దతుగా టిడిపి, జనసేన, బిజెపి లాంటి పార్టీలు ముందుకు వచ్చాయి.ఆయన ను అక్రమంగా అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నాయి.వీటన్నిటికీ చెక్ పెట్టి వారందరి నోరూ మూయించాలి అంటే తప్పనిసరిగా ఆయన కాల్, వాట్సప్ మెసేజ్ లు విశ్లేషించడం ఒక్కటే ఆధారంగా వైసీపీ ప్రభుత్వం నమ్ముతోంది.