బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ తాజాగా అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అయినట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.అయితే ప్రియాంక, నిక్ జోనస్ దంపతుల కంటే ముందే చాలామంది సెలబ్రిటీలు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన శిల్పాశెట్టి చాలాసార్లు గర్భస్రావం కావడంతో సరోగెసీ ఆప్షన్ పై మొగ్గు చూపారు.సరోగసి ద్వారా ఈ జంట సయేషా అనే పాపకు తల్లిదండ్రులు అయ్యారు.
అమీర్ ఖాన్ కిరణ్ రావ్ దంపతులు సరోగసి ద్వారా ఆజాద్ అనే బిడ్డకు పేరెంట్స్ అయ్యారు.ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన ప్రీతి జింటా అమెరికా బిజినెస్ మేన్ అయిన జీన్ గూఢ్ ఎనఫ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
గతేడాది ఈ దంపతులు జై, జియా అనే ఇద్దరు పిల్లలకు అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులయ్యారు.సన్నీ లియోన్ డేనియల్ వెబర్ దంపతులు మొదట నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు.
2018 సంవత్సరంలో ఈ దంపతులు అషర్, నొవా అనే ఇద్దరు చిన్నారులకు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు.
ఏక్తా కపూర్ కూడా 2019 సంవత్సరంలో సరోగసి విధానంలో రవి అనే బాబుకు తల్లయ్యారు.బాలీవుడ్ నటులలో ఒకరైన తుషార్ కపూర్ సైతం 2016 సంవత్సరంలో లక్ష్య కపూర్ అనే బాబుకు తండ్రి అయ్యారు.బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ దంపతులకు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ పేర్లతో కొడుకు కూతురు ఉన్నారు.
2013 సంవత్సరంలో అబ్రాం అనే బిడ్డకు సరోగసి విధానం ద్వారా షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ తల్లిదండ్రులయ్యారు.ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలతో పోల్చి చూస్తే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా సరోగసి విధానంపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం.