గత ఎనిమిది నెలలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంత మందిని ఈ కరోనా వైరస్ బలితీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇందులో భాగంగానే ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది ప్రముఖులు ఈ కరోనా వైరస్ బారినపడి తనువు చాలించారు.ఇందులో భాగంగానే భారతీయ చలనచిత్రాల్లో 40 వేల పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కూడా మరణించిన సంగతి తెలిసిందే.
ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ రావడం తో హాస్పిటల్లో చేరి దాని నుంచి కోలుకున్న కానీ ఆ తీవ్రత చివరికి బాలు గారి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.చివరికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అశేష అభిమానులను వదిలేసి పరలోకానికి చేరారు.
అయితే ఆయన మరణం ఎంత మంది అభిమానులలో తీవ్ర శోకాని మిగిల్చింది.ముఖ్యంగా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమకు ఆయన లేనిలోటు స్పష్టంగా కనబడుతుంది.అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఓ అభిమాని చైనా దేశం వల్లే ఎస్పీ బాలు గారు మరణించారని అంతర్జాతీయ న్యాయస్థానంలో చైనా దేశంపై కేసు పెట్టారు.కరోనా వైరస్ చైనా దేశం వల్లే మొదలైందని అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆధారాలతో సహా చూపిస్తూనే ఉన్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా అంతర్జాతీయంగా అనేక దేశాలు చైనాపై మండిపడుతున్నాయి.
కాకపోతే ఇందులో భాగంగానే ఓ న్యాయవాది ” చైనా దేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదగడంలో భాగంగా ఉద్దేశంతోనే కరోనా వైరస్ ను చైనా సృష్టించిందని” న్యాయవాది శ్రీనివాసరావు ఆరోపించారు.
కరోనా వైరస్ చైనా దేశం వల్లనే భారతదేశానికి వచ్చిందని అందువల్ల భారత దేశం ఎంతో ఆర్థికంగా నష్టపోయిందని, వాటితో పాటు ఎంతో మంది గొప్ప వ్యక్తులను కరోనా బలితీసుకుంది అంటూ తెలిపాడు.ఇందులో భాగంగానే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు మరణించారని… అందుకు కారణం చైనా దేశం అని జెనీవాలో అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో న్యాయవాది శ్రీనివాస్ కేసు వేసినట్లు తెలిపారు.