ఈ సృష్టిలో రకరకాల వింతలు, విశేషాలు ఉన్నాయి.అవి ఈ మధ్యే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మొన్న ఎలుకలు వైన్ బాటిళ్లు తాగిన ఘటన మనం చదివాం కదా.ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి జరిగింది.కానీ ఈ సారి వైన్ ప్లేస్లో సారా వచ్చి చేరితే ఎలుకల ప్లేస్లో గేదేలు వచ్చి చేరాయి.
వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.
ఈ ఘటన ఇటీవలే చోటు చేసుకుంది.గేదేలు మందు తాగి, తమ యజమానులను పోలీసులకు పట్టించాయి.
ఏంటి.గేదెలు మందు తాగడమేంటి, వాటి యజమానులను పోలీసులకు పట్టిండమేంటి అని ఆలోచిస్తున్నారా ? కానీ ఈ విచిత్రమైన ఘటన వివరాలు చదివితే మీరు కూడా ఓహో అలా జరిగిందా అని అంటారు.ఇక జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.గుజరాత్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుందీ విచిత్రం.ఆ రాష్ట్రం సంపూర్ణ మద్య పాన నిషేదం అమలు చేస్తోంది.అక్కడ ఎవరూ మందు తాగరు.
ఎవరూ మందు అమ్మరు.
కానీ కొందరు మందు బాబులు ఆ అలవాటును మానలేకపోయారు.
ఎక్కడి నుంచి మందు తెచ్చుకుంటున్నారో తెలియదు కానీ తరచూ సారా బాటళ్లు తెచ్చుకొని తాగుతున్నారు.
అయితే ప్రతీ రోజు వెళ్లి తెచ్చుకొనే బదులు ఒకే సారి కొంత పెద్ద మొత్తంలో తెచ్చుకొని దాచి పెట్టుకుంటున్నారు.అయితే ఇక్కడ దానిని దాచి పెట్టడం అన్నది పెద్ద సమస్య.ఎందుకంటే అక్కడ మద్య పాన నిషేదం అమలులో ఉంది.
ఎవరూ మందు అమ్మకూడదు.తాగకూడదు.
అయితే ఈ మందు ఊర్లోకి తీసుకొస్తే వీళ్ల బండారం బయటపడుతుంది.అనవసరంగా పోలీసులు, కేసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచించారు.
అందుకే వీరు కొంచెం కొత్తగా ఆలోచించి, పొలాల్లోనే దాచిపెడుతూ వస్తున్నారు.
అవసరం అయినప్పుడు వెళ్లి తాగి, మరి కొంత ఇంకో రోజుకు దాచిపెట్టుకుంటున్నారు.
అయితే ఇలాగే గుట్టుగా సాగిపోతున్న వారి మందు కహాని.గేదెల వల్ల లీక్ అయ్యింది.
ఎలాగంటారా ? ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాం.పాపం వీరు ప్రతీ రోజు ఏ గడ్డి వాము చాటునో, ఏ పొదల చాటునో మందు బాటిళ్లను దాచిపెట్టుకుంటున్నారు అనుకుంటా.
ఒక రోజు ఆ గడ్డివాము నుంచి గేదెలు తాగే నీళ్లలో ఆ బాటిళ్ల పడిపోయాయి.ఇంకేముందు మందు మొత్తం నీళ్లల్లో కలిసి పోయాయి.ఆ నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాయి.ఈ విషయాలేవి తెలియని వాటి యజమానులు ఆందోళన చెందారు.
వెంటనే వెటర్నరీ డాక్టర్ను సంప్రదించారు.ఈ గేదెలు తాగే నీటిలో ఏదో కలిసిందని నిర్ధారించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చి విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది.దీంతో గేదెల యజమానులను పోలీసులు పట్టుకుపోయారు.