ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసే వరకు వెళుతుంటాయి.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
ఓ పెళ్ళంట ఈ దారుణం చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం.భోజనాల దగ్గర జరిగిన చిన్న గొడవ ఆ ఇంట రక్తం పారేలా చేయడం జరిగింది.
స్వీట్స్ విషయంలో చిన్నగా మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అక్కడ రక్తపాతం జరిగింది.ఈ ఘటనలో ఆ పెళ్లి లోని వధువు సోదరుడుని హత్య చేయడమే కాకుండా తన కారుతో ఇద్దరు మహిళలు, అలాగే ఓ టీనేజ్ బాలికలను కూడా కారుతో తొక్కించేసాడు ఆ పెళ్లిలోని వరుడు.
సోమవారం సాయంత్రం ఫరూఖాబాద్లోని అట్సైని పహర్పూర్ గ్రామానికి చెందిన 26 సంవత్సరాల యువకుడు మనోజ్ కుమార్ కు అబ్దుల్లా పూర్ కు చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు.ఇక ఈ సమయంలోనే పెళ్లి అనంతరం రాత్రి బరాత్ కార్యక్రమాన్ని అక్కడ వారు జరుపుకున్నారు.
ఆ కార్యక్రమంలో పీకలదాకా తాగి ఉన్న వరుడు అతని స్నేహితులు పెళ్లి భోజనం వద్ద గొడవను సృష్టించారు.దీనితో వధువు తరపు బంధువులు తో వారు గొడవకు దిగారు.
ఆ సమయంలో వరుడి వాళ్లకి నీళ్లను సర్వ్ చేస్తున్న వధువు యొక్క సోదరుడు తొమ్మిదేళ్ల ప్రన్షుని బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు.ఇలా తీసుకుని వెళుతున్న క్రమంలో అక్కడున్న మనుషులు పట్టించుకోకుండా ఇద్దరు మహిళలు, ఒక బాలికపై కారు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది.
దీంతో వెంటనే వారిని లోహియా జిల్లా ఆస్పత్రికి తరలించారు.అయితే అక్కడ వారి పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
వధువు తమ్ముడిని కొట్టుకుంటూ తీసుకువెళ్లిన తర్వాత వరుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసి తీసుకు రమ్మని చెప్పిన మాట వినకుండా మరుసటి రోజు ఉదయం మూడు గంటలకి ఆ తమ్ముడి శవాన్ని పంపించారు.అయితే ఆ పిల్లాడి గొంతును నులిమి చంపినట్లుగా మెడపై ఆధారాలు ఉన్నాయని అలాగే ముఖం కూడా గుర్తు పట్టకుండా చేశారని వధువు పెద్ద అన్న పునీత్ కన్నీరు పెడుతూ చెప్పుకున్నాడు.
ఆ తర్వాత బాలుడి శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు పోలీసులు.ఇక ఆ కేసును నమోదు చేసుకున్నారు వారు.
దానికి సంబంధించిన నిందితుడు వరుడు, అతని బంధువుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.