సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అయితే చాలా వరకు డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు.
పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆ పెళ్లి పెటాకులు అవుతున్న పరిస్థితి.దీంతో ఆటు ఆడపిల్ల ఇటు పెళ్లి చేసుకున్న మగ వాడు కూడా సమాజానికి చాలా ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల పెళ్లి అయిన మొదటి రోజే భర్త ఇంటి నుండి వధువు నగదు నగలు తీసుకుని పారిపోవటం సంచలనం సృష్టించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
ఇతనికి ఇద్దరు సంతానం.ఇలాంటి తరుణంలో పిల్లల సంరక్షణ కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన కేశవ మురళి శ్రీ రెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను మా ఊరి పెద్దల సాక్షిగా వివాహం చేసుకోవడం జరిగింది.
అయితే వివాహం జరిగిన మరుసటి రోజే భరత ఇంటికి కాపురానికి వచ్చిన వధువు భర్త ఇంటిలో ఉన్న బంగారు నగలు మరియు 80 వేల రూపాయలు తీసుకుని పారిపోయింది.వెంటనే కేశవ మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రియుడితో కలసి ఒడిషాలో ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు.దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.