ఏ అమ్మాయికైనా పెండ్లి అంటే ఒక పెద్ద కల.తనకు నచ్చిన రాకుమారుడితో తన వివాహం జరగాలని ఆమె కోరుకుంటుంది.
అయితే ఇలాంటి అవకాశాలను కొందరు దుర్మార్గులు ఆసరాగా చేసుకుని చివరకు మోసం చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం.అయినా కూడా ఇలాంటి మోసాలు ఆగట్లేదు.ఇక తాజాగా ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో ఓ పెండ్లి వేడుకకు సంబంధించి విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.
అదేంటంటే ఏకంగా ఓ నవ వధువు శోభనం రోజు రాత్రి తన భర్తపై కంప్లయింట్ చేసేసింది.
ఎందుకంటే ఆమెకు ఎదురైన ట్విస్టు అలాంటిది మరి.
అసలు విషయం ఏంటంటే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి తన కుటుంబీకులు ఒక యువకుడి ఫొటో చూపించడగా యువకుడు అందంగానే ఉండటంతో ఆమె కూడా పెళ్లికి అంగీకరించింది.కాగా తీరా పెళ్లి అయిన తర్వాత తన భర్త ముఖం చూడగా ఆమె స్టన్ అయిపోయింది.
ఎందుకంటే అసలు ఫొటోలో చూసిన వ్యక్తికి ఇపపుడు తాను చూస్తున్న వ్యక్తికి అసలు సంబంధమే లేదు.ఇప్పుడు తాను చూస్తున్న వ్యక్తి ఫొటోలో ఉన్న వ్యక్తి ఒక్కరు కాదు.
దీంతో ఆమె మోసపోయానని గ్రహించింది.
ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తికి అప్పటికే వివాహం అయి పిల్లలు కూడా ఉన్నారు.ఇక ఇప్పుడు ఆమె తన అత్తగారింటికి వెళల్డానికి అస్సలు ఇష్టపడట్లేదు.ఇక ఇప్పుడు తన ప్రేమికుడితో కలిసి జీవించడం గురించి ఆలోచిస్తుందంట.
ప్రస్తుతం ఆ యువతి ఆ యువకుడితో కలిసి కొత్వాలి చేరుకుని అతడితోనే కలిసి కంప్లయింట్ చేసింది.ఇప్పుడు తన పెద్దలు తన ప్రేమికుడితో ఉండటానికి ఒప్పుకోకపోయినా సరే కచ్చితంగా అతడినే పెళ్లి చేసుకుంటానని తెలుపుతోంది.
దీంతో ఇప్పుడు వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.