తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడటానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కొరకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో బీజేపీ పటిష్టతకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించనున్న పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలను సోషల్ మీడియా వేదికగా బలోపేతం చేసే దిశగా తీవ్రంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే సోషల్ మీడియానే అస్త్రంగా మార్చుకోవాలనుకుంటున్న బీజేపీ అదే సోషల్ మీడియా ద్వారా బీజేపీ కొంత నవ్వుల పాలవుతున్న పరిస్థితి ఉంది.
టీఆర్ఎస్ కూడా బీజేపీ టార్గెట్ గా సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులతో బీజేపీకి సమాధానమిస్తున్న పరిస్థితి ఉంది.అయితే సోషల్ మీడియాలో బీజేపీ విజృంభణతో బీజేపీకి సరికొత్త చిక్కులు రావడమే కాక ఒక జోకర్ లలాగా ముద్రపడే అవకాశం ఉంది.
ఇప్పటికీ బండి సంజయ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యల తో అడ్డంగా టీఆర్ఎస్ కు దొరికిపోతూ ఇక ఎంతగా విమర్శలు చేసినా ప్రజల్లోకి వెళ్లలేనంతగా పరిస్థితి తయారయిందని చెప్పవచ్చు.అందుకే బీజేపీలో ఈ విషయంపై మేధో మధనం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే క్రమక్రమంగా చాలా వ్యూహాత్మకంగా బీజేపీని బలోపేతం చేస్తున్న పరిస్థితిలలో ఇటు టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే ఎటువంటి విమర్శ చేసినా ప్రభుత్వం ఇరుకునపడేలా వ్యవహరించి తద్వారా పెద్ద ఎత్తున బీజేపీ ప్రజల్లోకి వెళ్లాలనే పకడ్భందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.
మరి బీజేపీ మేధో మధనంతో రాష్ట్రంలో బీజేపీ మరింతగా బలోపేతమవుతుందా లేక ప్రస్తుత స్థితి నుండి మరింతగా దిగజారుతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.