బ్రెయిన్ డెడ్ కావడంతో 14 ఏళ్లకే మరణించిన ఓ బాలుడు ఆర్మీ జవాన్తో సహా ఆరుగురి ప్రాణాలకు తిరిగి ప్రాణం పోశాడు.వివరాల్లోకి వెళ్తే.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని తన రెసిడెన్షియల్ బిల్డింగ్లోని 3వ అంతస్తు పైనుంచి 14 ఏళ్ల జ్యోతిరాదిత్య ఖన్నా కిందపడి మరణించాడు.కింద పడిన తర్వాత అతడి మెదడు, ఛాతీకి బలమైన గాయాలయ్యాయి.
దాంతో ఈ పిల్లాడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు అపోలో డాక్టర్లు గురువారం వెల్లడించారు.
అయితే చిన్నతనం నుంచే ఈ బాలుడు తన అవయవాలను దానం చేయాలనుకునే వాడు.
అయితే 18 ఏళ్లు రాలేదు కాబట్టే తాను ఆర్గాన్ డొనేషన్కు అంగీకార పత్రం ఇవ్వలేకపోయాడు.కాగా తల్లిదండ్రులు అతడి కోరిక మేరకే అతడి అవయవాలను దానం చేశారు.
బాలుడి గుండె, ఇతర కీలక అవయవాలను దానం చేసి ఆరుగురికి మళ్ళీ కొత్త లైఫ్ అందించారు.ఇండియన్ ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన 44 ఏళ్ల వ్యక్తిలో ఈ బాలుడు గుండెను అమర్చారు.
జవాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అతని గుండె రక్తాన్ని సరిగ్గా ఇతర అవయవాలకు పంపించలేకపోతుందని ఒక రిపోర్టు వెల్లడించింది.కాగా తాజాగా బాలుడి గుండె అమరచడంతో అతడి ప్రాణాలను కాపాడినట్లయింది.
అసలు ఎప్పుడు చనిపోయాడు అంటే.నవంబర్ 15న జ్యోతిరాదిత్య అంతస్తు పైనుంచి కింద పడ్డాడు.ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హరిద్వార్లోని మెట్రో ఆసుపత్రికి తరలించారు.ఆపై బుధవారం పొద్దున పూట ఢిల్లీకి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి బ్రెయిన్స్టెమ్ రిఫ్లెక్స్లు లేవని తేల్చారు.అనంతరం బాలుడు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు.
ఈ సమయంలో డాక్టర్లు జ్యోతిరాదిత్య అవయవాలను దానం చేయాల్సిందిగా తల్లిదండ్రులకు కోరారు.అందుకు వారు అంగీకరించారు.3 ఆసుపత్రులకు అవయవాలను తరలించేందుకు మూడు గ్రీన్ కారిడార్లను రూపొందించారు.బాలుడి కళ్లను ష్రాఫ్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.
అలా మొత్తంగా ఆరుగురికి ఈ అవయవాలు అందాయి.