క్రికెట్ అనే పేరు వింటేనే మన దేశంలో కుర్రాళ్లు ఊగిపోతుంటారు.దీనికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
అయితే చాలా మంది క్రికెట్ను కేవలం ఆటగానే కాకుండా దాన్ని చాలా ఓన్ చేసుకుని చూస్తుంటారు.ఇదే అందరికీ కొన్ని సార్లు ఇబ్బందిని తెచ్చి పెడుతోంది.
అయితే ఆట సందర్భంగా ఆటగాళ్ల మధ్య కొన్ని విబేధాలు తలెత్తడం మనం చూస్తుంటాం.చాలాసార్లు ఇరుజట్ల ఆటగాళ్లు గొడవ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక ఆటలో గెలిచిన సందర్భంగా క్రికెటర్లకు కొన్ని బహమతులు, రివార్డులు కూడా ఇస్తారు.అయితే ఆటతో కాకుండా మన ఇండియన్ క్రికెటర్ కేవలం కంటి చూపుతోనే లక్ష గెలుచుకున్నాడు.
ఏంటి కంటిచూపుతోనా అని షాక్ అయిపోకండి.మీరు విన్నది నిజమే.అతను కేవలం కంటిచూపుతోనే ఇలా గెలుచుకున్నాడు.జైపూర్ వేదికగా నిన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా జరిగిన సంఘటనలో బౌలర్ దీపక్ చాహర్ లక్ష గెలుచుకున్నాడు.
విషయం ఏంటంటే 18వ ఓవర్ వేస్తున్న చాహర్ మొదటి బంతికే మార్టిన్ గుప్టిల్ సిక్స్ బాదేశాడు.అయితే ఇలా సిక్స్ కొట్టిన సందర్భంగా గప్తిల్ బాల్ను చూడకుండా దీపక్ను కోపంగా చూశాడు.
ఇక తర్వాతి బాల్ కే చాహర్ తన ప్రతాపం చూపించాడు.దెబ్బకు గప్టిల్ ను ఔట్ చేసేశాడు.
ఈ సందర్భంగా గప్తిల్ను కూడా అదే చూపుతో చాహర్ చూశాడు.ఈ చూపు విపరీతంగా హల్ చల్ చేసింది.ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.అయితే దీన్ని మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ గా పరిగణించారు.ఇందుకు లక్ష నగదు దీపక్కు అందజేశారు.ఇక ఈ మ్యాచ్లో 5వికెట్ల తేడాతో ఇక ఇండియా గెలుపులో దీపక్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించాడని చెప్పొచ్చు.
మొత్తానికి తన కంటి చూపుతో లక్ష గెలచుకోవడంతో పాటు ఇండియాను విజయతీరాలకు చేర్చిన దీపక్కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.