మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన నేతలకి అదేరీతిలో బిజెపి నాయకులకు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.మొదటి నుండి ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిణామాలు ఉండటంతో… శివసేన భవనాన్ని కూల్చేస్తామని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ కామెంట్లు చేయటంతో మహారాష్ట్రలో శివసేన వర్సెస్ బిజెపి వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది.
పోటాపోటీగా ఇరు పార్టీల నాయకులు సవాళ్లు విసురుతున్నారు.ఇటీవల శివసేన అధినేత మహారాష్ట్ర సీఎం పర్యటన నీ బిజెపి కార్యకర్తలు.
నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది.
ఇక ఇదే క్రమంలో మహారాష్ట్ర ఆస్తులను గుజరాతీయులకు బిజెపి నేతలు కట్టబెడుతున్నారు అంటూ.
శివసేన నాయకులు ఎదురు దాడి స్టార్ట్ చేశారు.ముంబై ఎయిర్పోర్టులో అదాని గ్రూప్ కలిగిన బోర్డులు ఏర్పాటు కావడంతో.
శివసేన నాయకులు విమానాశ్రయంలో ఆ బోర్డు కలిగిన వాటి పై దాడికి దిగారు.ఈ క్రమంలో లో శివసేన భవనాన్ని కూల్చేస్తామని బిజెపి ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ కామెంట్లు కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
తమని కొడతామని ఎవరైనా డైలాగ్ వేశారంటే తాము కూడా అదే రీతిలో బదులు ఇస్తామని కానీ వాళ్లు మళ్లీ పైకి లేగకుండా కొడతామని.ఉద్ధవ్ థాకరే బదులిచ్చారు.ఈ రీతిగా మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ శివసేన అన్న పరిస్థితి నెలకొంది.