తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై రోజుకో ట్విస్ట్ తో రసవత్తరంగా రాజకీయాలు మారిన పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పై మాటల తూటాలు పేలుస్తూ అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేసేందుకు బీజేపీ బలమైన వ్యూహాలు రచిస్తోంది.
టీఆర్ఎస్ కు ఏ ఒక్క ఛాన్స్ దొరికినా మరల బీజేపీ ఒకప్పటి స్థితికి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులలో బీజేపీ ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది.
కేసీఆర్ ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నా మౌనంగా ఉంటూ తనదైన వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేసే అవకాశం లేకపోలేదు.ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరిది పైచేయవుతుందో వేచి చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ కూడా పుంజుకోవాలని ప్రయత్నిస్తుండడంతో ప్రభుత్వంపై జరిపే పోరాటంలో ఏమాత్రం వెనక్కి తగ్గినా వెనకపడిపోతామని భావిస్తున్న బీజేపీ రకరకాల వ్యూహాలతో టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది.ఏది ఏమైనా బీజేపీ,టీఆర్ఎస్ మధ్య రసవత్తర రాజకీయ పోరు నడుస్తోంది.