ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది.
అందుకే ఉదృతంగానే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు అంతా ఇక్కడే మకాం వేసి మరి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓటర్ల నాడి తెలుసుకుని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది.
ఇప్పటికే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఖర్చు పెట్టి అయినా సరే ఈటెల రాజేందర్ ను ఓడించాలనే ఉద్దేశంలో టిఆర్ఎస్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది.అయితే టిఆర్ఎస్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు బిజెపి కూడా ఇప్పుడు సీరియస్ గానే రంగంలోకి దిగింది.
ఈ ఎన్నికల్లో కెసిఆర్ పై చేయి సాధించకుండా తగిన వ్యూహాలను రూపొందిస్తోంది.ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం దక్కే ఛాన్స్ ఉంటుంది అనే సంకేతాలతో మరింతగా అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి.
భారీ ఎత్తున సొమ్ము ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తుండడంతో దానికి కౌంటర్ గా బీజేపీ రంగంలోకి దిగింది అనే ప్రచారం జరుగుతోంది.ఇటీవల హైదరాబాద్ లోని సనత్ నగర్ లో హెటిరో డ్రగ్స్ లో ఐటీ దాడులు జరిగాయి దాదాపు 142.87 కోట్ల సొమ్మును సీజ్ చేశారు .ఈ దాడుల వెనక బిజెపి ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.దీనికి కారణం కెసిఆర్ సమీప బంధువుల మెడిసిన్ హెటిరో డ్రగ్స్ లో తయారవుతున్నాయట.ఈ ఫార్మాస్యూటికల్ ద్వారానే కెసిఆర్ కు తగిన ఆర్థిక సహాయం అందుతుంది అనే అనుమానాలు పెరగడంతోనే బిజెపి ఈ దాడులు చేయించినట్టు గా అర్ధం అవుతోంది.
హెటిరో డ్రగ్స్ కార్యాలయాల్లో ఐటి దాడులు చేయించడం ద్వారా టిఆర్ఎస్ కు ఆర్థిక సహాయం అందకుండా చేయవచ్చనేది బీజేపీ ప్లాన్ అనేది చర్చనీయాంశం గా మారింది.దేశవ్యాప్తంగా హేటిరో పై ఒకేసారి ఐటీ దాడులు జరిగాయి.కేవలం 142 కోట్లు మాత్రమే కాకుండా ఇంకా లెక్కల్లోకి రాని వందల కోట్లు ఉండవచ్చనే అనుమానాలు ఐటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మెడిసిన్ ను విదేశాలకు ఎగుమతి చేసిన హెటిరో నకిలీ ఎం వోలు సృష్టించి ప్రభుత్వానికి టాక్స్ లు కట్టకుండా భారీగా సొమ్ములు వెనకేసుకున్నారు అని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.
హెటిరో డ్రగ్స్ కెసిఆర్ ఆర్థిక మూలాల్లో ఒకటి కాబట్టే బీజేపీ ఈ దాడుల వెనుక ఉంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.