తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలలో అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది.ఇక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగి తెలంగాణ ఏర్పడింది.
తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఇప్పటికీ రెండు పర్యాయాలు జరిగినా నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపపట్టలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అదే విధంగా నిరుద్యోగులలో కూడా కొంత అసంతృప్తి ఉంది.వయస్సు మించిపోతోందని, ఇక తరువాత నోటీకేషన్లు విడుదల చేసినా ప్రయోజనం లేదని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా ఉద్యమాన్ని బలంగా నడిపించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.ఈ పరిస్థితులలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాడాలని తద్వారా యువతకు కొంత మేర దగ్గరయ్యే అవకాశం ఉండడంతో నిరుద్యోగుల ఆవేదన ఎక్కడ వినబడ్డా బీజేపీ వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే విధంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
తద్వారా యువతకు తమకు బీజేపీ అండగా ఉంటుందనే భరోసాను పెద్ద ఎత్తున వారికి కలిగించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.ఈ వ్యూహం మరి బీజేపీకి ఎంత మేర లాభం చేకూరుస్తుందనేది చూడాల్సి ఉంది.