తెలంగాణలో బీజేపీ ఎన్నో రకాల ఇబ్బందులను ప్రస్తుతం ఎదుర్కుంటోంది.అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ పై పట్టు సాధించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నిస్తుండగా, దానిని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ అంతే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది.
వరుసగా బీజేపీ కి దక్కిన విజయాలతో ఆ పార్టీ ఉత్సాహంగా ఉంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుపు తమ ఖాతలో పడుతుందని బీజేపీ నమ్ముతోంది .అందుకే అనేక ప్రజా సమస్యలను హైలెట్ చేసుకుంటూ తెలంగాణలో టిఆర్ఎస్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అయితే వరుసగా బీజేపీ తీసుకుంటున్న చర్యలు తమకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి అనే ఆందోళన లో అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఉంది.
అందుకే బీజేపీ పై ఎదురు దాడిని మరింత తీవ్రతరం చేసింది.
అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బీజేపీ నాయకుల పై దాడులకు టిఆర్ఎస్ శ్రేణులు జరుగుతుండడం వంటి వ్యవహారాలు ఈ మధ్య కాలంలో మరింత తీవ్రతరం అయ్యాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు సమస్యలపై నల్గొండ జనగామ జిల్లాలో పర్యటించిన సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో పాటు దాడులకు దిగారు.ఇటీవల టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జిఓ కారణంగా ఉద్యోగ , ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ నిరసన దీక్షకు దిగగా ఆయన ను అరెస్టు చేసి జైలుకు పంపించిన వ్యవహారము సంచలనం రేపింది.
ఇకపై టిఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని బీజేపి హెచ్చరికలు చేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారాలను న్యాయపరంగా తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.
వరసగా చోటుచేసుకున్న ఘటన పై డీజీపీ కి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయాలని, అక్కడ తగిన న్యాయం జరగకపోతే న్యాయస్థానంలోనే తేల్చుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.అంతేకాదు ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు తగిన సహకారం అందిస్తూ ఉండటంతో, తెలంగాణ బీజేపీ నాయకులు మరింత దూకుడు పెంచినట్టుగా కనిపిస్తున్నారు.