తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.అసలు బీజేపీ టీఆర్ఎస్ కు ఇంతలా పోటీనిచ్చేలా ఎదుగుతోందని టీఆర్ఎస్ కూడా ఊహించి ఉండదు.
అయితే బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో క్లాస్ లీడర్ లకు పెద్దగా గుర్తింపు ఉండదు.
అందుకే బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టక ముందు లక్ష్మణ్, కిషన్ రెడ్డి లాంటి నాయకులు తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా పని చేసినా బీజేపీ మాత్రం ప్రస్తుతం ఉన్నంతలా మాత్రం బలపడలేక పోయింది.దానికి కారణం లక్ష్మణ్, కిషన్ రెడ్డి లాంటి నాయకులు క్లాస్ లీడర్ లు కావడమే.
అందుకే మాస్ లీడర్ గా పేరొందిన బండి సంజయ్ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక్కసారిగా బీజేపీ పుంజుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రజల్లో రోజురోజుకు బీజేపీ బలపడుతుండటంతో ఒకప్పటి టీఆర్ఎస్ వ్యూహాన్ని బీజేపీ అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ కి ఉన్న ముఖ్యమైన బలం వాక్చాతుర్యం.ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేసి ప్రజలను ఆకట్టుకొని పార్టీగా ఓటర్లను ఆకర్షించడం లో టీఆర్ఎస్ విజయవంతమైనట్టుగా ఏ పార్టీ విజయవంతం కాలేదు.
అందుకే ఇప్పుడు ఇదే విధానాన్ని బీజేపీ అవలంబిస్తోంది.
అందుకే విమర్శల విషయంలో బీజేపీ ఎక్కడా కూడా తగ్గడం లేదు.ఎంతలా విమర్శలతో సంచలనం రేపితే అంతలా ప్రజల్లో బలం పెరుగుతుందని భావిస్తున్న పరిస్థితి ఉంది.అందుకే తాజాగా బండి సంజయ్ మతపరమైన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సంచలనం రేపిన పరిస్థితి ఉంది.
అయితే ఈ పదునైన విమర్శల వ్యూహం టీఆర్ఎస్ కు ఎంతలా లాభించిందో బీజేపీకి కూడా అంతలా లాభిస్తుందా అనేది తెలియాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చేయాల్సిందే.
.