ఈ రోజుల్లో ఏదైనా రెస్టారెంట్కు వెళ్తే ఆహార పదార్థాల ధరలు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.వందల్లో ఉండడంతో పర్సు ఖాళీ అవుతుందనే భయం వెంటాడుతోంది.ఫ్యామిలీతో రెస్టారెంట్కు వెళితే ఖచ్చితంగా రూ.2 వేల వరకు బిల్లు అవుతుంది.ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.రూ.26కు ప్రస్తుత రోజుల్లో ఏం వస్తుందో మీకు తెలుసు.ఓ చిప్స్ ప్యాకెట్ వస్తుంది.అయితే రెస్టారెంట్లో ఫుల్లుగా తింటే వచ్చిన బిల్లు కేవలం రూ.26 అంటే నమ్ముతారా.కానీ ఇది నిజం.అయితే ఆ బిల్లు ఇప్పటిది కాదు.ఢిల్లీలో 1985 నాటి బిల్లు అది.అప్పట్లో ఆహార పదార్థాలు అంత తక్కువ ధరకే లభించేవా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.దానికి సంబంధించిన బిల్లు ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ఏదైనా బిర్యానీ తింటే రూ.300లపైనే రెస్టారెంట్లలో బిల్లు వేస్తున్నారు.కనీసం ఏదైనా టిఫిన్ తిన్నా వందల్లోనే ఉంటోంది.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ధరలు ఎలా ఉండేవో ఆలోచిస్తే ఈ తరం వారు ఆశ్చర్యపోతారు.1985లో షాహీ పనీర్ ధర కేవలం రూ.8, దాల్ మఖ్నీ రూ.10 కంటే తక్కువ అని తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.ఢిల్లీ రెస్టారెంట్ 1985 నాటి బిల్లును షేర్ చేసింది.
ఇది చాలా మంది నెటిజన్లను షాక్కు గురి చేసింది.వాస్తవానికి ఆగస్టు 12, 2013న ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ పోస్ట్ మళ్లీ వైరల్గా మారింది.
ఢిల్లీలోని లజ్పత్ నగర్ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్, లాజీజ్ రెస్టారెంట్ హోటల్, డిసెంబర్ 20, 1985 నాటి బిల్లును ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది.కస్టమర్ షాహీ పనీర్, దాల్ మఖ్నీ, రైతా మరియు కొన్ని చపాతీల ప్లేట్ను ఆర్డర్ చేశారు.మొదటి రెండు వంటకాలకు రూ.8, మిగిలిన రెండింటికి వరుసగా రూ.5, రూ.6 చొప్పున వస్తువుల ధరలు నిర్ణయించారు.ఈ వస్తువులన్నీ వినియోగదారునికి కేవలం రూ.26 మాత్రమే.ఇప్పుడు బిల్లు తక్కువ ధరపై నెటిజన్లు స్పందిస్తున్నారు.బిల్లును చూసిన ఒక వినియోగదారు, “గత రోజులు పోయాయి” అని రాశారు.