జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరికీ తెలీదు.అప్పటి వరకు అందంగా గడిచిన క్షణంలోనే విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.
ఎన్నో కలలతో అత్తారింట్లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది యువతీ.తన కొత్త జీవితానికి నాంది పలకావడానికి ముస్తాబై వెళ్తున్నా పెళ్లి కూతురికి అనుకోని ఘటన ఎదురైంది.
అంత సేపు ఆనంద క్షణాలు అన్ని ఒక్కసారిగా ఆవిరైపోయాయి.ఇక పెండ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తున్న వధువుకు తృటితో ప్రమాదం తప్పింది.
పెండ్లి బృందంపైకి ఒక వాహనం దూసుకొచ్చింది.ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లోని నయి మండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లోని వధువు హేమకు వరుడు అంకూర్తో పెండ్లి నిశ్చయమైంది.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వధువు, ఆమె తరుఫు వారు విడిది ఇంటి నుంచి ఊరేగింపుగా పెండ్లి వేదికకు బయలుదేరారు.ఇక డెహ్రాడూన్ జాతీయ రహదారిపై మేళతాళాలతో ఊరేగింపు సాగుతున్నది.
పాటలకు పరవశం చెందిన వధువు హేమ కారు టాప్ విండో తెరిచి డ్యాన్స్ చేయసాగింది.దీంతో బంధువులు కూడా మంచి జోష్తో చిందులు వేస్తున్నారు.
ఇక అంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది.ఒక కారు వేగంగా పెండ్లి బృందంపైకి దూసుకెళ్లింది.దీంతో అంతా ఉలిక్కిపడ్డారు.ఈ ప్రమాదంలో వరుడి తరుఫు బంధువు ప్రమోద్ అనే వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు.వారిని మీరట్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, ఈ ఘటన పెండ్లి వేడుకలో విషాదం నింపింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ తెగ వైరల్ అవుతుంది.