మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇటీవలే దసరా బరిలో గాడ్ ఫాదర్ సినిమాతో దిగి తన అదృష్టం పరీక్షించు కున్నాడు.
ఇక ఇప్పుడు మరో పండుగను కబ్జా చేసాడు.వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు.
ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేసారు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”వాల్తేరు వీరయ్య” షూటింగ్ చివరిలో ఉంది.
ఈ షూట్ ముగించి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ప్రొమోషన్స్ తో బరిలోకి దిగబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రొమోషనల్ అప్డేట్ లు వచ్చాయి.
అందులో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ కూడా ఉంది.క్రేజీ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
ఈ సాంగ్ మెల్లగా స్లో పాయిజన్ లాగా ప్రేక్షకులకు ఎక్కుతుంది.
మాస్ బీట్స్ తో ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది.
ఇక ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మెగాస్టార్ తో ఆడిపాడింది.డీజే వీరయ్యగా మారి మెగాస్టార్ అదరగొట్టగా ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.
ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో దూసుకు పోతుంది.ఈ సాంగ్ ఇప్పుడు ఏకంగా 2 కోట్ల వ్యూస్ సాధించి అదరగొడుతుంది.
ఈ విషయాన్ని మేకర్స్ ఎంతో ఆనందంగా పంచుకున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సాంగ్ ను మరో మెట్టు ఎక్కేలా చేసింది.ఇలా బాస్ పార్టీ సాంగ్ మాత్రం నెట్టింట అదరగొడుతుంది.దీంతో దేవిశ్రీ ఖాతాలో కూడా మరో చార్ట్ బస్టర్ చేరిపోయింది.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.