కొన్ని సార్లు మనం ఊహించని ఘటనలు జరుగుతూనే ఉంటాయి.అందులో కొన్ని భయంకరంగా ఉండగా, మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి.
ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.ఇలాంటి ఘటన జరిగింది ఒకటి.
మిడ్ నైట్ టైంలో ఓ ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడింది.దీంతో అందులో ఉన్న మహిళ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అలాంటి ఘటన మనకు జరిగితే భయంతో కేకలు వేస్తాం.రక్షించాలని ఇతరులను వేడుకుంటాం.
లేదంటే ఎక్కువ ధైర్యం ఉంటే దానిని ఇంట్లోంచి బయటకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తాం.కానీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసా.
అమెరికా దేశంలోని న్యూజెర్సీ నగరం.వెర్నాన్ కు చెందిన ఓ మహిళ కు అటవి జంతువులంటే చాలా ఇష్టం.
ఆమెసైతం అడవి పక్కన ఉన్న ఓ ఇంట్లో నివాసం ఉంటోంది.ఈ కారణంగా అటవిలోని వన్య మృగాలు ఆమె ఇంటికి తరచూ వస్తుంటాయి.
ఇలా వచ్చిన జంతువులకు ఆమె ఫ్రూట్స్, కూరగాయలకు సంబంధించిన తుక్కు వంటివి పెడుతూ ఉండేది.దీంతో చివరకు ఆ జంతువులు ఎలా మారిపోయాయి అంటే ఆమె ఏం చేబితే అవి చేస్తున్నాయి.
తాజాగా ఆమె ఇంటి వద్దకు అర్ధరాత్రి టైంలో ఓ ఎలుగుబంటి వచ్చి తలుపు కొట్టింది.
దీంతో ఆమె డోర్ తీసి ఎలుగుబంటిని రికార్డు చేసింది.గాలి చల్లగా వస్తోంది.డోర్ క్లోజ్ చేయు అంటూ ఎలుగుబంటికి చెప్పింది ఆమె.కాసేపు ఆమె వైపు చూస్తూనే ఎలుగుబంటి నిల్చుని, ఆమె ఆహారం ఇవ్వదనుకుని డోర్ వేసింది.కంప్లీట్గా డోర్ వేయకపోవడంతో చిన్న గ్యాప్ లోంచి లోనికి చల్లగాలి వస్తోంది.
దీంతో ఆమె మిస్టర్ బియర్… ప్లీజ్ డోర్ మూసేస్తావా.అని గట్టిగా చెప్పడంతో ఎలుగుబంటి డోర్ను మొత్తం క్లోజ్ చేసి బయటకు వెళ్లిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.దీన్ని చూస్తున్న నెటిజన్లు ఇదొక చందమామ కథలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.