ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా స్కూల్స్ మూతపడ్డ సంగతి తెలిసిందే.మహమ్మారి కరోనా కారణంగా.
క్లోజ్ అయిన స్కూల్స్.కి తర్వాత సెలవులు ప్రకటించడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.రాష్ట్రంలో ఆగస్టు 16 నుండి పాఠశాలలో ఓపెన్ అవుతున్నట్లు స్పష్టం చేశారు.
అంతమాత్రమే కాకుండా “జగనన్న విద్యా కానుక” పథకం ద్వారా విద్యార్థులకు అదేరోజు పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ కానుకలను ఈసారి ఇంగ్లీష్ డిక్షనరీ కూడా చేర్చినట్లు స్పష్టం చేశారు.
ఇటీవల “జగనన్న విద్యా దీవెన” కార్యక్రమం రెండో విడత జరిగిన సమయంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అంత మాత్రమే కాక నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన 15 వేల పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు.మళ్ళీ రెండో విడత “నాడు నేడు” కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని ఆదిమూలపు సురేష్ అన్నారు.