ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ అయిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా విద్య మరియు వైద్య రంగాలలో కీలక మార్పులు తీసుకు వచ్చేలాగా సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీంతో “నాడు నేడు” కింద ప్రభుత్వ స్కూల్స్ లో అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు చేపడుతూనే మరోపక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కూడా నాడు-నేడు లో భాగస్వామ్యం చేసి అన్ని వసతులు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు నాడు-నేడు లో పశువుల ఆసుపత్రులు కూడా చేర్చడం జరిగింది.
దీంతో పశువుల ఆసుపత్రులను నాడు-నేడు తరహాలో ఆధునీకరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.అంతే కాకుండా పశువులకు సంబంధించి పూర్తి హెల్త్ కార్డులను కూడా కొనసాగించాలని కూడా తెలిపారు.
ఇదిలా ఉంటే పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపించగా సీఎం జగన్ వాటిని ఆమోదించారు.