షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల నిరసన..!

తెలంగాణాకు దక్కాల్సిన నీటులో ఒక్క చుక్క కూడా వదులుకోమని ఈమధ్యనే వైఎస్ షర్మిల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.అందుకోసం ఎవరినైనా ఎదురిస్తానని ఆమె అన్నారు.

 Ap Farmers Agitation At Sharmila Residence In Hyderabad, Agitation, Ap, Farmers,-TeluguStop.com

అయితే షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని రైతులు మండిపడుతున్నారు.హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల ఇంటి ముందు ఏపీ రైతులు ధర్నాకి దిగారు.

కృష్ణా నీళ విషయంలో ఆమె వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ కొందరు షర్మిల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.షర్మిల ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించ్గా ఆమె మద్ధతు దారులు అడ్డుకున్నారు.

కృష్ణా నీళ్ల విషయంలో షర్మిల వైఖరిని స్పష్టం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ఆమె వ్యాఖ్యల వల్ల రాయలసీమ రైతులు నష్టం చేసేలా ఉన్నాయని అన్నారు.అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపుడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Telugu Farmers, Hyderabad, Kcr, Sharmila, Ys Sharmila-General-Telugu

వైఎస్సార్ తెలంగాణా పార్టీ స్థాపించిన షర్మిల తెలంగాణా ప్రజలకు అండగా ఉంటానని చెబుతున్నారు.తెలంగాణాలో దొరల పాలనకు అంతం పలకాలని ఆమె కే.సి.ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణాకి అన్యాయం జరగకూడదని ఏపీపై పోరటానికి సిద్ధమని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube