హైదరాబాద్ లో తొలిరోజు ఆపరేషన్ రోప్ పకడ్బందీగా అమలు అవుతుంది.ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు పడుతున్నాయి.
తాజాగా ట్రాఫిక్ చలానాపై ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైత్రివనంలో రాంగ్ రూట్ లో వచ్చిన బైకిస్ట్ కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు.
ఈ క్రమంలో వారితో వివాదానికి దిగిన వాహనదారుడు తన బైకుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.కాగా మొదటి రోజు 472 వాహనాలు, 18 వ్యాపార సంస్థలకు అధికారులు జరిమానాలు విధించారు.
అయితే, ఈ చలాన్లపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇష్టానుసారం ఫైన్ లు వేయడం సరికాదని విమర్శిస్తున్నారు.