చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం దేశం మొత్తం గుర్తు పట్టే స్థాయికి చేరుకున్న డ్యాన్స్ మాస్టర్ శేఖర్.అవకాశాలు రాని రోజుల్లో కూడా ఏ మాత్రం కుంగిపోక లక్ష్యసాధన కోసం ఆయన శ్రమించిన తీరు వర్ణణాతీతం.
అలాంటి స్థితి నుంచి నేడు మరో కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నాడంటే నిజంగా గొప్పే కదా.
మొన్నటివరకూ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్… ఇప్పుడు బుల్లితెరపైనా తన హవా కొనసాగిస్తున్నారు.ఒకప్పుడు ఢీ షోలో జడ్జిగా వ్యవహరించి.ప్రస్తుతం కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్తో అందరినీ అలరిస్తున్నారు.దీంతో పాటు ఆయన చాలా రోజుల క్రితమే ఒక యూట్యూబ్ ఛానెల్ను స్టార్ట్ చేసి.తన అభిప్రాయాలు, తన ఫ్యామీలీతో గడిపిన మధుర జ్ఞాపకాలు.
ఇలా చాలానే ఉన్నాయి.వాటన్నింటినీ వీడియోల రూపంలో చేసి… అభిమానులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నారు.
ఇదిలా ఉండగా శేఖర్ మాస్టర్ ప్రస్తుతం నిర్మాతగా కూడా మారారు.యూట్యూబ్లో శేఖర్ స్టూడియో అని ఛానెల్ పెట్టిన శేఖర్ మాస్టర్.కొత్తగా వెబ్ సిరీస్తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.టెర్రస్ అనే పేరుతో రాబోతోన్న ఓ వెబ్ సిరీస్ కోసం తన సన్నిహితుల సాయం కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, ఆది వంటి వారు తమ తమ జీవితంలోని టెర్రస్ కథలను గుట్టును విప్పేశారు.తాజాగా నటి పూర్ణ కూడా తన జీవితంలోని టెర్రస్ స్టోరీలను బయట పెట్టేసింది.ఈ మేరకు విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
శేఖర్ మాస్టర్ నిర్మాతగా సక్సెస్ అయ్యేందుకు మొదటి ప్రాజెక్ట్ను భారీగానే ప్రమోట్ చేసుకుంటున్నట్టు తెలుస్తూనే ఉంది.
దాని కోసం తన ఇంఫ్లూయెన్స్ మొత్తాన్ని వాడుతున్నారు.బుల్లితెర తారలతో టెర్రస్ కథలను చెప్పిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.
ఈ క్రమంలో పూర్ణ చెప్పిన విషయాలు అందరికీ నవ్వును తెప్పిస్తున్నాయి.లవ్ స్టోరీ కాకుండా స్యాడ్ స్టోరీని పూర్ణ పంచుకున్నారు.
అందులో భాగంగా.“నాకు టెర్రస్ లవ్ స్టోరీల్లాంటివి అయితే ఏమీ లేవు.ఎందుకంటే నా చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా నా బ్రదర్స్ లాంటి వాళ్లే.అయితే టెర్రస్ అంటే మాత్రం ఓ సంఘటన గుర్తుకు వస్తుంది.చిన్నప్పుడు టెర్రస్ మీద నుంచి కిందపడ్డాను.అప్పుడు తలకు పెద్ద గాయమైంది.
రెండు మూడు నెలలు హాస్పిటల్లోనే ఉన్నాను.అప్పటి నుంచి నాకు ఈ సమస్య ఉంది.
” అంటూ తన టెర్రస్ స్టోరీని చెప్పుకొచ్చారు పూర్ణ.శేఖర్ మాస్టర్ నిర్మిస్తోన్న టెర్రస్ లవ్ స్టోరీని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని పూర్ణ తెలిపింది.
పూర్ణనే కాదు.బుల్లితెరతో పాటు.
వెండితెర అభిమానులు కూడా ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.