టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు కూతురు “నిహారిక కొణిదెల” ఇటీవలే చైతన్య జొన్నలగడ్డ ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈమె పెళ్లి ఈ నెల తొమ్మిదో తారీఖున ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ లో మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది.
కాగా ఈ పెళ్ళికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మరియు సాయి ధరంతేజ్ కుటుంబ సభ్యులు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ కేవలం తన కుమారుడు అకీరా నందన్ మరియు కూతురు ఆరాధ్య తో మాత్రమే ఈ వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు.
దీంతో కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో పవన్ కళ్యాణ్ మూడో భార్య “అన్నా లెజినోవో” గురించి తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు.
కాగా తాజాగా ఈ విషయంపై మెగా కుటుంభ సభ్యులు స్పందిస్తూ అన్నా లెజినోవో తన పిల్లలతో కలిసి తన స్వస్థలం అయినటువంటి రష్యా కి క్రిస్మస్ వేడుకలకి వెళ్లిందని తెలిపారు.కాగా ప్రతి ఏడాది డిసెంబర్ మాసం మొదట్లో అన్నా లెజినోవో రష్యా కి వెళుతుందని క్రిస్మస్ వేడుకలను పూర్తి చేసుకొని మళ్లీ జనవరి నెలలో తిరిగి భారతదేశానికి వస్తుందని అందువల్లే ఆమె నిహారిక వివాహానికి హాజరు కాలేకపోయిందని స్పష్టం చేశారు.అంతే తప్ప తమ కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలుగానీ, మనస్పర్ధలుగాని లేవని నిజానిజాలు తెలుసుకోకుండా తమ కుటంబం గురించి తప్పుడు ప్రచారాలు చెయ్యద్దని సూచించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ న్యాయం కోసం పోరాటం చేసేటువంటి “పవర్ ఫుల్ లాయర్” పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయి విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా షూటింగ్ పనులు వాయిదా పడటంతో ఈ చిత్ర విడుదల మరింత కాలం ఆలస్యం కానుంది.