ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొంది.ప్రముఖ డెలివరీ సమస్థ జొమాటో.
పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా సేవలను అందిస్తుంది.డెలివరీ భాగస్వాములుగా పెద్ద ఎత్తున మహిళలు చేర్చుకోవడం తెలిసినా విషయమే.
అసలు విషయానికి వస్తే దాదాపు 13 సంవత్సరాల క్రితం ఇద్దరు కుర్రవాళ్ళు డిల్లీ సరిహద్దుల్లోని గురుగ్రామ్ లో ఓ కేఫ్ కి భోజనం కి వెళ్లారు.అక్కడ చాలా రద్దీగా ఉంది ఏదో విధంగా భోజనం పూర్తి చేసుకుని ఆఫీస్ కి తిరిగి వచ్చారు.
అక్కడున్నవారంతా ఫుడ్ మెనూ గురించి మాట్లాడుకోవడం వీరిద్దరు గమనించారు.అది గమనిస్తున్న ఇద్దరు కుర్రోళ్లు మనసులో ఒక ఆలోచన తట్టింది.ఫుడ్ మెనూ, వివిధ రకాల వంటలు ఇవన్నీ ఒకే డిజిటల్ వేదికపై తేస్తే ఎలావెంటనే ఆ మెనూ స్కాన్ చేసి తన కంపెనీ ఇంటర్నెట్లో రెస్టారెంట్ డైరెక్టరీని రూపొందించారు.కొన్ని రోజులకే డిమాండ్ బాగా పెరిగింది.
దీన్ని ఫుడ్బే.కామ్ గా ఓ వేబ్ సైట్ రూపొందించారు.
ఈ సర్వీస్ న్యూ ఢిల్లీ వ్యాప్తంగా విస్తరించారు కొద్దిరోజులకే మంచి ఆదరణ లభించింది.
ఫుడ్బే.కామ్ ఆదరణ పెరగడంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది.దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని భావించారు అయితే అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ పేరుతో పోలి ఉండటంతో 2010 లో జొమాటో గా నామకరణం చేశారు.
జొమాటో అనే పదం జొమాటో.కమ్ అనే యూ ఆర్ ఎల్(URL) ను ఓ ప్రముఖ బ్రాండింగ్ సమస్త నుంచి కొనుగోలు చేశారట.జొమాటో వృద్ధికి పసిగట్టిన అనేక పెట్టుబడి సమస్థలు నిధులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.భారీ ఆదరణతో జోమాటో వ్యవస్థాపకుడు సీఈవో దీపందర్ గోయల్ భారత కుబేరుల జాబితాలో చేరాడు.
ఆయన వ్యక్తిగత సంపద 650 మిలియన్ డాలర్లకు చేరింది
.