ఎవరికైనా ఏదైనా విషయంలో భయం అనేది ఉండే ఉంటుంది.అది ఏ విషయంలోనైనా సరే వాళ్లకు ఆ విషయంలో భయం ఉంటే ఇక వాటి జోలికే వెళ్లరు.
చీకటి, నీరు, వాహనాలు, చిన్న చిన్న జంతువులు, జీవులు ఇలా ఎన్నో రకాల వాటిని చూసినప్పుడు కొందరికి ఏదో రకమైన విచిత్రమైన భయం అనేది ఉంటుంది.ఇవి కేవలం చిన్న విషయాలే కానీ వాళ్లకు భయంకర ప్రళయం గా కనిపిస్తాయి.
ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోయిన్ కి కూడా ఓ విచిత్రమైన భయం ఉందట.
ఇంతకీ ఆమె ఎవరంటే మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి హీరోయిన్ లైలా.
ఈమె తెలుగు సినీ నటి.అంతే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది.1996లో హిందీ సినీ పరిశ్రమలో మొబైల్ పెట్టగా.ఆ తర్వాత ఏడాది ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఇక వరుస సినిమాలో నటించిన లైలా 2004లో మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలో చివరిగా నటించింది.
ఇదిలా ఉంటే లైలా కు ఓ విచిత్రమైన భయం ఉందట.అదేంటంటే ఆమెకు నీళ్లు అంటే భయమట.నీటి లోపలికి వెళ్తే ఆమెకు కళ్ళు తిరుగుతాయట.మరి ఈ విషయం ఆమె ఎప్పుడు చెప్పిందంటే.
మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి సినిమా లో ఓ సన్నివేశంలో అక్కడున్న చెరువులో స్నానం చేస్తే గతజన్మ పాపాలు పోతాయని అందులో ఒక నటుడు అనగా.వాళ్లంతా అక్కడికి వెళ్లి నీటిని చల్లుకుంటారు.
నిజానికి వాళ్ళు అందులో స్నానం చేయాలి కానీ లైలా కోసం వాళ్లు నీటిని మీద చల్లుకున్నారని ఈ సినీ డైరెక్టర్ ఓ సందర్భంలో తెలిపాడు.ఇక ఆ సమయంలో ఆమెను డైరెక్టర్ చెరువులో కి వెళ్ళమని అనగా తనకు నీరు అంటే ఫోబియా అని తెలిపిందట
.