ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు ఎంత కునారిల్లుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అసలు పార్టీలో ఎప్పటి వరకు ఎంత మంది ఉంటారో చెప్పలేని పరిస్థితి.
అయితే ఓ వైపు అసంతృప్తులు చెలరేగుతుండడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.మరోవైపు పార్టీ బలహీన స్థితిలో ఉన్న విషయాన్ని ఆసరాగా చేసుకుని పార్టీ అధిష్టానాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేయమని పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపును కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఆమె సోదరుడు రాజకీయం చేసుకునేందుకు వాడుకుంటున్నారన్న గుసగుసలు వస్తున్నాయి.
మాజీ మంత్రి అఖిలప్రియ పొలిటికల్ ఎంట్రీ, ఆమె ఎమ్మెల్యే అవ్వడం, ఆ తర్వాత మంత్రి అవ్వడం అనుకోకుండా జరిగాయి.
ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో ఆమె పట్టుబట్టి మరీ తన సోదరుడు బ్రహ్మానందరెడ్డికి ఆ సీటును ఇప్పించుకోవడం, ఆ ఎన్నిక దేశవ్యాప్తంగా హైలెట్ అవ్వడం జరిగిన విషయం తెలిసిందే.ఇక గత ఎన్నికల్లో ఆళ్లగడ్డలో అఖిల, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నంద్యాలలో ఆమె తన కజిన్ అయిన బ్రహ్మానందరెడ్డికే ఎసరు పెడుతూ తన సొంత సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిని రంగంలోకి తీసుకు వస్తున్నారు.
ప్రస్తుతం ఆళ్లగడ్డలో టీడీపీ రాజకీయాలను ఆమె తన భర్తతో కలిసి పూర్తిగా శాసిస్తున్నారు.ఇక నంద్యాలలో జగత్.తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.
అక్క ఇచ్చిన డైరెక్షన్లో ఆయన దూసుకుపోతున్నారు.అయితే అక్క, తమ్ముడు ఇద్దరూ రెండు నియోజకవర్గాలను పంచుకుని రాజకీయం చేస్తుండడంతో టీడీపీలోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇప్పటికే పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు.మరోవైపు వారసులు, బంధువుల ఇలా నియోజకవర్గాలను పంచుకుని రాజకీయం చేస్తే మిగిలిన వారికి అవకాశాలు ఎక్కడ ? వస్తాయన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిలప్రియ బలంగా వాయిస్ వినిపిస్తుండడంతో చంద్రబాబు సైతం వాళ్లు ఏం చేసినా.ఎన్ని నియోజకవర్గాలు పంచుకున్నా ఏం అనలేని పరిస్థితి ఉంది.