స్మార్ట్ఫోన్ మార్కెట్లో బ్యాటరీ టెక్నాలజీ క్రమంగా పెరుగుతూ పవర్ బ్యాంక్స్ వినియోగం క్రమేపీ తగ్గుతూ వస్తోంది.ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్లను కేవలం నిమిషాల వ్యవధిలోనే చార్జ్ చేసుకుంటున్నారు.
అయితే వినియోగదారులు జర్నీలో వున్నపుడు, లేదంటే పవర్ కట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పవర్ బ్యాంక్స్తోనే ప్రత్యామ్నాయం పొందవలసి ఉంటుంది.ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ కంపెనీ అంబ్రేన్ తాజాగా కొత్త పవర్ బ్యాంక్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
దీని ద్వారా కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ల్యాప్ టాప్స్ కూడా చార్జ్ చేసుకోవచ్చు.
అవును, ఇందులో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కూడాను.అంతేకాకుండా దీని కెపాసిటీ కూడా 40,000 MAHగా ఉంది.
ఈ మేడిన్ ఇండియా పవర్ బ్యాంక్ ద్వారా ఫోన్లను సులభంగానే వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.ల్యాప్స్ టాప్స్, ట్యాబ్స్ వంటి వాటికి కూడా చార్జింగ్ క్షణాల్లో చేసేసుకోవచ్చు.
కాగా ఈ పవర్ బ్యాంక్కు 180 రోజుల వారంటీ ఉంటుంది.దీని కెపాసిటీ 40000 ఎంఏహెచ్.
ఇది లిథియం పాలీమర్ బ్యాటరీ.పవర్ బ్యాంక్లోని 65 వాట్ పీడీ ఫాస్ట్ చార్జింగ్ ఔట్పుట్, 20 వాట్ డీసీ 2.0 ఔట్ పుట్ ద్వారా స్మార్ట్ఫోన్స్ వేగంగా చార్జ్ అవుతాయి.
ఈ పవర్ బ్యాంక్లో రెండు USB పోర్టులు ఉండగా ఒక టైప్ C పోర్ట్ ఉంటుంది.వీటి ద్వారా మల్టీపుల్ డివైజ్లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు.అలాగే LED ఇండికేటర్ ద్వారా పవర్ బ్యాంక్లో ఎంత చార్జింగ్ మిగిలి ఉందో కూడా ఇట్టే చెక్ చేసుకోవచ్చు.
ఇది ABS ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయబడింది.ఇంకా 12 లేయర్ల అడ్వాన్స్డ్ చిప్ సెట్ ప్రొటెక్షన్ దీనిసొంతం.అందువల్ల ఈ పవర్ బ్యాంక్ హీట్ కావడం లేదా డ్యామేజ్ అవ్వడం వంటివి దాదాపుగా ఉండనే ఉండవు.కంపెనీ కొత్తగా తీసుకువచ్చిన ఈ అంబ్రేన్ స్టైలో బూస్ట్ పవర్ బ్యాంక్ ధర రూ.4,299గా ఉంది.దీన్ని దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో కొనొచ్చు.