తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కు రాజకీయంగా ఏం చేయాలో ? ఎలాంటి స్టెప్పులు వేయాలో కూడా అర్థం కాని పరిస్థితి.బాబు ఏ డెసిషన్ తీసుకున్నా ముందు నుయ్యి.
వెనక గొయ్యి చందంగా మారుతోంది.రాజకీయంగా సరైన వ్యూహాలు లేకపోవడం.
పదే పదే యూటర్న్లు తీసుకోవడం కూడా బాబుకు మైనస్ అవుతోంది.చివరకు సొంత పార్టీ నేతలే బాబును నమ్మడం లేదు.
ఇక జగన్ను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢీ కొట్టే పరిస్థితి లేదని డిసైడ్ అయిన చంద్రబాబు కొద్ది రోజులుగా ఢిల్లీతో లింకుల కోసం.బీజేపీతో రాజీ కోసం కొత్త గేమ్కు తెరలేపారు.
బీజేపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.గతంలో పదేళ్ల పాటు అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ పెద్దలతో లాబీయింగ్ చేసి వచ్చేవారు.
అప్పుడు అంటే అద్వానీతో పాటు ఆయన గ్యాంగ్తో చంద్రబాబుకు పరిచయాలు ఎక్కువ.ఇప్పుడు బీజేపీ నేతల్లో ఏ ఒక్కరు కూడా బాబును దగ్గరకు రానివ్వడం కాదు కదా.కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
చంద్రబాబు
రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఢిల్లీతో ఆయన లింకులు కోల్పోయారు.మరోవైపు కాంగ్రెస్ కూడా ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు.2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీకి దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ వెంటనే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను పక్కన పెట్టేశారు.
చంద్రబాబు ఆశలు రివర్స్ అయ్యాయి.
కేంద్రంలో కాంగ్రెస్, ఇక్కడ ఆయన అధికారంలోకి రాలేదు.
ఇటు చూస్తే బీజేపీ భవిష్యత్తులో కూడా బాబును దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు.అందుకే చంద్రబాబు ఇక్కడ జగన్ను ఢీ కొట్టలేక అటు జగన్కు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేయలేక విలవిల్లాడుతోన్న పరిస్థితి.
ఇక ఢిల్లీలో లాభం లేదనుకునే చంద్రబాబు ఢిల్లీ గడప తొక్కి దాదాపు ఏడాదన్నర కావస్తుంది.ఇక బీజేపీ నేతలను కలుస్తారని ఆయన గాసిప్పులు, లీకులు కూడా ఎక్కువుగా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.