దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు సంపాదించుకున్న వారిలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఒకరు.ఈమె ప్రస్తుతం తెలుగు,తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక పోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి సినీ ఇండస్ట్రీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తన గ్లామర్ విషయంలో తనకు ఎన్నో భయాలు ఉన్నాయని, ముఖ్యంగా తాను సినిమాలలో చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్ట పడతానని తెలిపారు.
ఇకపోతే తను నటించిన మొదటి సినిమా ప్రేమమ్ సినిమాలో నటించేటప్పుడు తన గ్లామర్ విషయంలో చాలా భయపడ్డానని తెలిపారు.ఇక అందం గురించి కూడా పెద్దగా క్లారిటీ లేకపోవడంతో కంగారుగా ఉండేదని తెలిపారు.
ఇక ఈమె కాలేజీ చదువుతున్న రోజులలోనే సినిమాలలోకి వచ్చానని తెలిపారు. హీరోయిన్స్ అంటే ఎంతో అందంగా ఉంటారు.
కానీ నా విషయంలో అలా కాదు మొహం మొత్తం మచ్చలు, పింపుల్స్ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలో సెట్ అవుతానా అనే నమ్మకం ఉండేది.
నా సినిమాను చూసి చాలా మంది నా అందం గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని చాలా బాధపడేదాన్ని ఈ విషయంలో నేను ఎంతో మానసికంగా కృంగి పోయానని సాయిపల్లవి ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా ఎంతో భయంతో ఉన్న నాకు ప్రేమమ్ సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా నా ఆందోళన మొత్తం తొలగిపోయిందని, నేను ఆలోచించే విధానం చాలా తప్పు అని ఆరోజు భావించానని సాయి పల్లవి తెలిపారు.ఎవరైనా సరే పైకి కనిపించే అందానికి కాకుండా వారి క్యారెక్టర్ కు ఎక్కువ విలువ ఇస్తారని ఆరోజే అర్థమైంది.
ప్రేమమ్ సినిమాతో నాలో ఆత్మవిశ్వాసం బలపడటమే కాకుండా మనసు మరింత తేలికగా అయిందని సాయి పల్లవి ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.