తెలుగులో ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన “నీ మనసు నాకు తెలుసు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ “త్రిష” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.త్రిష ఈ చిత్రంలో నటించడంకంటే ముందు పలు తమిళ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో కనిపించింది.
ఆ తరువాత తెలిసిన వారి ద్వారా నీ మనసు నాకు తెలుసు చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం తగ్గించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకుంది.దీంతో వెంటనే తెలుగులో యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన “వర్షం” చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి సినిమా కెరియర్ పూర్తిగా మారిపోయింది.
తాజాగా హీరోయిన్ త్రిష గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే త్రిష తెలుగులో ఓ ప్రముఖ సినీ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడిందని ఈ విషయం కాస్త తన ప్రియుడి తండ్రికి తెలియడంతో ఆ నిర్మాత త్రిష కి వార్నింగ్ ఇచ్చాడని కొందరు నెట్టింట్లో తెగ చర్చించుకుంటున్నారు.ఈ కారణం వల్లే త్రిష టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దూరం అయిందని అలాగే గత కొద్ది కాలంగా తెలుగు చిత్రాల్లో నటించకపోవడానికి కూడా అదే కారణమని పలు పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే హీరోయిన్ త్రిష మాత్రం తన ప్రేమ వ్యవహారంపై వినిపిస్తున్న పుకార్ల గురించి స్పందించడానికి ఇష్టపడడం లేదు. దీంతో త్రిష ప్రియుడు ఎవరా.? అంటూ నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం త్రిష తమిళంలో దాదాపుగా 6కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న “పొన్నియన్ సెల్వన్” అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రం భారీ బడ్జెట్ తరహాలో ఉండనుంది.
అయితే ఆ మధ్య టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికి పలు కారణాల వల్ల ఆ చిత్రం నుంచి తప్పుకుంది.